మొదటిగా తెలుగు చలన చిత్ర సినీ పరిశ్రమకి ఎలాంటి సినీ కుటుంబ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి రియల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకున్న “ప్రముఖ నటుడు శ్రీహరి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే శ్రీహరి కేవలం హీరో పాత్రలో మాత్రమే కాకుండా విలన్ గా మరియు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కూడా నటించి సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.
కానీ అనుకోకుండా గుండె పోటు కారణంగా 49 సంవత్సరాల వయసులో మృతి చెందాడు.
అయితే తాజాగా స్వర్గీయ నటుడు శ్రీహరికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే శ్రీహరి అప్పట్లో టాలీవుడ్ యంగ్ హీరో సాయిరాం శంకర్ నటించిన “యమహో యమః” చిత్రంలో భామ గెటప్ లో నటిస్తున్న సమయంలో తీసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ నటుడు శ్రీహరి పాత్రకు మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.
అంతేగాక ఎలాంటి పాత్రలోనైనా శ్రీహరి నటించగలడని నిరూపించాడు.
అయితే 200కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి మెప్పించిన శ్రీహరి ఐదు కి పైగా అవార్డులను కూడా గెలుచుకున్నాడు.కాగా ఇటీవలే శ్రీహరి పెద్ద కొడుకు “మేఘాంశ్ శ్రీహరి” రాజ్ దూత్ అనే చిత్రంలో హీరోగా నటించి ప్రేక్షకులని బాగానే అలరించాడు.కాగా ప్రస్తుతం మేఘాంశ్ శ్రీహరి ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరక్కేక్కిస్తున్న చిత్రంలో కూడా హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం….
.