ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న సినిమాలలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి.మిగిలిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి.
నిర్మాతలు కూడా ఏదో సాధిద్దాం అన్నట్లుగా కాకుండా నమ్మకంతో ఆసక్తితో సినిమాలు తీస్తున్నారు.కానీ నిర్మాతలకు మాత్రం సినిమా విడుదలైన తర్వాత తీవ్ర నిరాశ ఎదురవుతుంది.
నిర్మాతలు ముందు ముందు లేకుండా పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.నిర్మాతలు లేకపోతే సినీ ఇండస్ట్రీ లేదు వారిని కాపాడుకోవాలి అని ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు తెలిపిన విషయం తెలిసిందే.
అయితే పవన్ కళ్యాణ్ నిర్మాతలు కూడా కష్టంలో ఉంటే తన పారితోషికాన్ని కూడా వెనక్కి ఇస్తాడు అని గతంలో ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే.కానీ ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న దీరుకు నిర్మాతలు చిరాకు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఒక్కొక్క నిర్మాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద పదులకోట్లలో ఖర్చుపెట్టి కూర్చున్నారు.ఇప్పుడు వారు నెత్తినూరు బాదుకున్నా కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది.
అయితే సినిమాలు చేస్తాను అని చెప్పి అడ్వాన్స్ ఇప్పించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బస్సు యాత్ర అంటూ మొదలు పెట్టబోతున్నాడు.
మరొకవైపు అడ్వాన్స్ ఇచ్చిన వారి సినిమాకు కూడా సిద్ధమవుతున్నాడు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు భగవదీయుడు భగత్ సింగ్ సినిమాల గురించి గత కొంతకాలంగా వార్త వినిపిస్తున్న సంగతి తెలిసిందే.కానీ ఇప్పటివరకు ఆ సినిమాలను పవన్ కళ్యాణ్ పూర్తి చేయలేదు.ఇక భగవద్వీడు సినిమాను అయితే ఇంకా కనీసం మొదలు పెట్టాను లేదు.వారి నుండి దాదాపు 40 కోట్ల వరకు అడ్వాన్స్ తీసుకున్నారట.వారికి రెండేళ్లుగా డేట్స్ ఇవ్వడం లేదు.ఇంకా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు అయితే ఇప్పటికే పాతిక కోట్ల వరకు అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనేది చెప్పడం లేదట.దానితో నిర్మాతలు అందరూ ఏదో ఒక సమయంలో నిర్మాత మండలిని ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ అదే గనక జరిగితే పవన్ కళ్యాణ్ పరువు పోవడం ఖాయం అని అంటున్నారు.దీనితో ఈ విషయం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.