అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.
కాని ఆమెకు అది సాధ్యం కావడం లేదు.ఇప్పటికే నటించిన సినిమా లు ఏవీ కూడా కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకోలేదు.
పైగా వాటిల్లో ఆమె నటనపై విమర్షల వర్షం కురుస్తుంది.ఈ సమయంలో జాన్వీ కపూర్ కు బాలీవుడ్ లో ఆఫర్లు చాలా రేర్ గా వస్తున్నాయి.
బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినా కూడా సౌత్ లో సినిమా లు చేసేందుకు మాత్రం ఆమెకు ఇష్టం కలుగడం లేదు.ఇప్పటికే సౌత్ నుండి పలు ఆఫర్లు ఆమె తలుపు తట్టాయి.
కాని ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ఆమె ఓకే చెప్పలేదు.ముందు ముందు ఆమెను తెలుగు లేదా తమిళ ఇండస్ట్రీకి తీసుకు వచ్చేందుకు కూడా ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించగా నో చెప్పిందట.దాంతో వారు బోనీ కపూర్ ద్వారా ఆమెను సంప్రదించి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ వారు వచ్చే ఏడాది ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.ఆ సినిమా లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తే పాన్ ఇండియ అప్పీల్ సినిమా కు దక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు.
అందుకే ఆమెను ఈ సినిమా లో నటింపజేస్తామని చాలా నమ్మకంగా వారు చెబుతున్నారు.కాని ఇప్పటి వరకు జాన్వీ కపూర్ మాత్రం మైత్రి వారికి ఓకే చెప్పిన దాఖలాలు కనిపించడం లేదు.బోనీ కపూర్ అయినా ఆమెను సౌత్ కు ఒప్పిస్తాడా అనేది చూడాలి.జాన్వీ కపూర్ కోసం దిల్ రాజు మొదలుకుని పలువురు నిర్మాతలు కూడా ప్రయత్నిస్తున్నారు.ఆమె అంటే ఎందుకో మన నిర్మాతలకు అంత మోజు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.