టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వం వహించినటువంటి “ప్రస్థానం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ “రూబీ పరిహార్” గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఈ అమ్మడు నటించినటువంటి తన మొదటి చిత్రమే తెలుగులో మంచి విజయాన్ని సాధించింది.
దీంతో వరుసగా కన్నడ, తమిళ తదితర చిత్రాలలో సినిమా అవకాశాలు దక్కించుకుంది.కానీ కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో ఈ అమ్మడు సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగించ లేక పోయింది.
అయితే ప్రస్థానం చిత్రంలో హీరోగా నటించిన తర్వాత రాజేంద్ర, ప్రేమలో ఏబిసి, కమీనా, యక్ష తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడి కంటూ చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోయింది.
దీంతో చివరగా తెలుగులో 2014 సంవత్సరంలో ఇట్స్ మై లైఫ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది.ఆ తర్వాత బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన “గబ్బర్ ఈజ్ బ్యాక్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.
ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.కానీ ఈ చిత్రంలో ఈ అమ్మడు పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించ లేదు.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించిన ఎలాంటి సినిమా సమాచారం లేదు. కానీ సినిమా అవకాశాలు లేకపోవడంతో నటి రూబీ పరిహార్ మోడలింగ్ రంగంపై దృష్టి సారించినట్లు సమాచారం.అయితే గత కొద్ది కాలంగా బాలీవుడ్ ప్రముఖ మోడల్ రూబీ పరిహార్ ప్రేమలో ఉందని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకూ రూబీ పరిహార్ ఈ విషయంపై ఎలాంటి స్పష్ఠత ఇవ్వలేదు.