తెలుగులో పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ మరియు లవ్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య గురించి చలన చిత్ర పరిశ్రమలో తెలియనివారుండరు.ఒకప్పుడు దర్శకుడు వి.ఎన్ ఆదిత్య తెలుగులో మనసంతా నువ్వే, నేనున్నాను, బాస్, ఆట, తదితర బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.అయితే ఏమైందో ఏమోగాని ఈ మధ్యకాలంలో దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇంతకుముందు లాగా తన చిత్రాలతో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో దర్శకుడు పాల్గొని తన సినీ జీవితంలో చోటు చేసుకున్న పలు రూమర్లు, గాసిప్స్ గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ సినిమా ఇండస్ట్రీలో మీకు ఓ ప్రముఖ సెలబ్రెటీతో లవ్ ఎఫైర్ ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయని నిజమేనా అని అడిగాడు.
దీంతో వి.ఎన్ ఆదిత్య ఏమో అండి నాకు కూడా తెలియదు.ఆ సెలబ్రిటీ ఎవరో ఒకవేళ మీకు తెలిసి ఉంటే చెప్పండి.నాకు కూడా తెలుసుకోవాలని ఉందని తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.అలాగే సినిమా ఇండస్ట్రీలో మనము ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కొంతమంది బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ క్రమంలోనే లవ్ ఫెయిల్యూర్, ఈగో వంటి వాటిని అంటగడుతూ మనుషులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.దీంతో దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ప్రేమ వ్యవహారంపై వినిపిస్తున్న రూమర్స్, గాసిప్స్ కి కొంతమేర ఫుల్ స్టాప్ పడింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా దర్శకుడు వి.ఎన్ ఆదిత్య 2011 సంవత్సరంలో “ముగ్గురు” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
మళ్ళీ తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత “వాళ్ళిద్దరి మధ్య” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో ఈ డిజాస్టర్ల ప్రభావం వి.ఎన్ ఆదిత్య కెరియర్ పై పడినట్లు తెలుస్తోంది.