తెలుగులో ఒకప్పుడు పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ స్వర్గీయ నటుడు “ఉదయ్ కిరణ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఉదయ్ కిరణ్ భౌతికంగా ప్రస్తుతం సినీ ప్రేక్షకుల మధ్యలో లేకపోయినప్పటికీ అతడు నటించిన చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.
కాగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు దర్శకుడు రవి బాబు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని స్వర్గీయ నటుడు ఉదయ్ కిరణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా గతంలో తాను దర్శకత్వం వహించిన “సోగ్గాడు” అనే చిత్రంలో ఉదయ్ కిరణ్ ని తరుణ్ తో కలిసి హీరోగా నటింపజేయాలని అనుకున్నానని కానీ అనుకోకుండా చివరి నిమిషంలో ఉదయ్ కిరణ్ ఈ చిత్రంలో నటించనని చెప్పాడని తెలిపాడు.
దాంతో బాలీవుడ్ కి చెందినటువంటి ఓ నటుడిని ఈ చిత్రంలో రెండో హీరోగా నటింపజేశామని దాంతో ఈ చిత్ర ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయని చెప్పుకొచ్చాడు.అయితే ఎప్పుడైతే ఉదయ్ కిరణ్ ఈ చిత్రంలో నటించనని చెప్పాడో అప్పుడే తాను ఈ చిత్రాన్ని తెరకెక్కించకుండా ఉండాల్సిందని కానీ పట్టింపులకు పోయి సినిమా తీసినందువల్ల ఆ ప్రభావం ఫలితంపై పడిందని తెలిపాడు.
అలాగే ఉదయ్ కిరణ్ కోసం రాసుకున్న క్లైమాక్స్ కూడా పూర్తిగా మార్చేశామని ఈ విషయం కూడా సోగ్గాడు చిత్రానికి మైనస్ అయిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య రవి బాబు తెలుగులో “ఆవిరి” అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ప్రస్తుతం రవి బాబు తెలుగులో “క్రష్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రం కొంతమేర అడల్ట్ కంటెంట్ తరహా లో ఉండ పోతున్నట్లు సమాచారం.కాగా ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.