సౌత్ ఇండియాలో దేవిశ్రీ ప్రసాద్, తమన్ తర్వాత భాగా వినిపిస్తున్న పేరు గోపి సుందర్.మలయాళంలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న గోపి సుందర్ తెలుగులో మీడియం రేంజ్ సినిమాలకి ఎక్కువగా మ్యూజిక్ అందిస్తున్నాడు.
తెలుగులో అతను చేసిన సినిమాలు అన్ని కూడా ఇంచుమించు మ్యూజికల్ హిట్స్ అయినవే.గీత గోవిందం సినిమా రిలీజ్ కి ముందే అందులో పాటలతో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది.
ఇక ఎక్కువగా మెలోడీ బీట్స్ తో సాంగ్స్ ఇచ్చే గోపి సుందర్ అప్పుడప్పుడు మలయాళం మాస్ టేస్ట్ ని ఎక్కడి ప్రేక్షకులకి పరిచయం చేస్తూ ఉంటాడు.
ఇక ఈ మ్యూజిక్ దర్శకుడు మొదటిసారి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ లాంటి స్టార్ హీరోతో పని చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.పరశురాం సినిమాలు అంటే కుటుంబాలు, బంధాలు చుట్టూ ఎక్కువగా ఉంటాయి.
ఈ నేపధ్యంలో వరుస హిట్స్ మీద ఉన్న మహేష్ బాబు ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో కూడా ఒక హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఇక గోపి సుందర్ ఈ సినిమా కోసం అప్పుడే ట్యూన్స్ సిద్ధం చేసే పని కూడా మొదలెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా సక్సెస్ అయితే గోపి సుందర్ టాలీవుడ్ లో కచ్చితంగా తమన్, దేవిశ్రీలకి పోటీగా మారుతాడు అని చెప్పొచ్చు.