క్రికెట్ అంటే ఇండియాలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు.క్రికెట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు కూడా ఈ కారణంగానే హిట్ అయ్యాయి.
అలాగే తెలుగులో నాని హీరోగా క్రికెట్ నేపధ్యంలో వచ్చిన జెర్సీ.రీసెంట్ గా ఈ సినిమా రెండు నేషనల్ అవార్డులని సైతం గెలుచుకుంది.
అలాగే హిందీలో కూడా షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతుంది.కొడుకు కోరిక తీర్చడం కోసం ప్రాణానికి ప్రమాదం అని తెలిసిన కూడా లేటు వయసులో క్రికెట్ ఆడి ఇండియన్ టీంకి ఎంపికైన ఆటగాడుగా నాని ఈ సినిమాలో నటించాడు.
ఈ తండ్రి కొడుకుల ఎమోషనల్ ఎలిమెంట్ జెర్సీ సినిమాలో అందరికి కనెక్ట్ అయ్యింది.ఈ కారణంగానే సినిమా కూడా హిట్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ జెర్సీ సినిమా ప్రభావం తనపై ఉందని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఎంపికైన ఏపీకి చెందిన యువ క్రికెటర్ అంటున్నాడు.అతని పేరు హరి శంకర్ రెడ్డి.
కడప జిల్లాకి చెందిన ఈ యువ క్రికెటర్ దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఎంపికయ్యాడు.
ప్రస్తుతం ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్న అతను చెన్నై మీడియం టీంతో సంభాషించాడు.
ఈ సందర్భంగా తెలుగులోనే మాట్లాడుతూ జెర్సీ సినిమాను గుర్తుకు తెచ్చుకున్నాడు.ఆ సినిమాతో తాను ఎంతగానో కనెక్ట్ అయ్యానని క్రికెటర్ల భావోద్వేగాలను ఆ సినిమాలో చాలా బాగా చూపించారని, ముఖ్యంగా ట్రైన్ సీన్ చూసి తాను చాలా ఎమోషనల్ అయ్యానని హరిశంకర్ తెలిపాడు.
తాను ఐపీఎల్ వేలంలో చెన్నై జట్టుకు ఎంపికైనపుడు తన రూంలో సరిగ్గా అలాగే అరిచానని, అప్పుడు జెర్సీ సినిమానే గుర్తుకొచ్చిందని చెప్పాడు.ఈ వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది.
మొత్తానికి తెరపై కనిపించే కొన్ని దృశ్యాలు నిజజీవితంలో కొందరిని ఇన్స్పైర్ చేస్తాయని హరిశంకర్ రెడ్డి మాటల బట్టి మరోసారి అర్ధమవుతుంది.