కరోనా ప్రభావంతో అన్ని పరిశ్రమలు కుదేలయ్యే ప్రమాదంలో పడ్డాయి.సినిమా పరిశ్రమ కూడా ఇప్పటికే తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటోంది.
మూడు నాలుగు నెలల వరకు థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.ఈ సమయంలో సినిమాల విడుదల ఉండటమే కష్టం.
ఇక పలువురు స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ విషయంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.భారీ ఎత్తున బడ్జెట్ పెడితే గతంలో మాదిరిగా రిటర్న్స్ వచ్చే పరిస్థితి లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రిటర్న్ లేని ఈ సమయంలో బడ్జెట్ను కుదించుకోవాలని నిర్మాతలు భావిస్తారు.సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం హీరోల పారితోషికం ఉంటుంది.అందుకే హీరోల పారితోషికాలు కుదించాలని నిర్ణయించుకున్నారు.టాలీవుడ్లో ఒక స్టార్ హీరో పారితోషికం 40 కోట్లు అనుకుంటే ఆ హీరోకు ఈ కరోనా కారణంగా పాతిక కోట్ల నుండి 30 కోట్ల వరకు మాత్రమే దక్కే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.
పరిస్థితి మరింతగా క్షీణిస్తే ఆ మొత్తం మరింతగా తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు.అంటే సగానికి పడిపోయే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో హీరోలు తీవ్రంగా నష్టపోతారంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.నిర్మాతలు కూడా గతంలో మాదిరిగా కోట్ల రూపాయలను ఆదాయంగా దక్కించుకోవడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.
తెలుగు సినిమా వసూళ్లు రాబోయే సంవత్సరం పాటు కేవలం 60 నుండి 70 కోట్లు టాప్ అంటున్నారు.ఈ పరిస్థితులు ఎంత కాలం కొనసాగేనో చూడాలి.