తెలుగులో ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వం వహించిన యువరాజు అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి బుడతడు “తేజ సజ్జ” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అప్పట్లో తన ముద్దు ముద్దు మాటలతో డైలాగులు చెబుతూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.
అయితే ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
కాగా ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తేజ సజ్జ బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉన్నాడు.
అయితే ఇందులో భాగంగా తాజాగా మట్టి వచ్చే గణపతి మహోత్సవాలలో మట్టి గణపతులు ఉపయోగించాలని అందరికీ సూచించాడు.తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ అభ్యర్థి జోగినేపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఉద్యమానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని మానవాళికి ఉపయోగపడేటువంటి ఇంత మంచి ప్రోగ్రామ్ ని ప్రజలలోకి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన “ఓహ్ బేబీ” చిత్రంలో తేజ సజ్జ కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. దీంతో ప్రస్తుతం హీరోగా అవకాశాలు దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.