తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను బాగానే అలరించిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మామిళ్ల శైలజా ప్రియ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే శైలజా ప్రియ వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు ధారావాహికలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమాలు సీరియల్ షూటింగులను తాత్కాలికంగా నిలిపి వేశారు.దీంతో గత కొద్దికాలంగా శైలజ ప్రియ ఇంటి వద్ద ఖాళీగా గడుపుతోంది.
అయితే తాజాగా శైలజ ప్రియ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో ద్వారా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోలో నటి శైలజ ప్రియ తన నడుముపై ఉన్నటువంటి పుట్టు మచ్చ కనిపించడమే కాకుండా “ఎంబ్రస్ యువర్ ఓన్ పేస్” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
దీంతో కొందరు నెటిజన్లు శైలజా ప్రియషేర్ చేసిన ఈ ఫోటోకి ఫిదా అయ్యారు.
అంతేకాకుండా ప్రస్తుతం శైలజా ప్రియకి దాదాపుగా 40 ఏళ్ళు దాటినప్పటికీ వన్నె తరగని అందంతో చాలా యంగ్ గా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి కొందరు మాత్రం దయచేసి ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని వెంటనే డిలీట్ చేయాలని కోరుతున్నారు.
ఈ విషయంలో ఇలా ఉండగా శైలజా ప్రియ ఇటీవల విడుదలైన ఉప్పెన, శ్రీకారం, జాంబీ రెడ్డి, తదితర చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి బాగానే ఆకట్టుకుంది.కాగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన జీ తెలుగులో ప్రసారమయ్యే “నెంబర్ వన్ కోడలు” అనే ధారావాహికలో కూడా మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తూ బాగానే అలరిస్తోంది.