పలు టాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తన సెంటిమెంటల్ నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి “ప్రగతి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో నటి ప్రగతి సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు బాగానే అందుబాటులో ఉంటోంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడు అందమైన ఫోటోలు మరియు పాటలకి స్టెప్పులేస్తూ తీసినటువంటి వీడియోలు వంటివి షేర్ చేస్తూ బాగానే అలరిస్తోంది.
అయితే గత కొద్దికాలంగా కరోనా వైరస్ కారణంగా వ్యాయామశాలలు మూసి వేయడంతో నటి ప్రగతి ఏకంగా తన ఇంట్లోనే వర్కౌట్లు చేస్తూ అలాగే ప్రత్యేక ఆహార డైట్ పాటిస్తోంది.
అయితే తాజాగా నటి ప్రగతి వ్యాయామం చేస్తుండగా తీసినటువంటి వీడియో ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.దీంతో కొందరు నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ 40 ఏళ్ల వయసు దాటినప్పటికీ యంగ్ గా కనిపించాలనే కోరిక తో నటి ప్రగతి ఫిట్నెస్ కోసం పడుతున్న కష్టాన్ని అభినందిస్తున్నారు.
అంతేకాకుండా ఈ వీడియో పై తాజాగా ప్రముఖ నటి నీలిమా సాయి కూడా స్పందించింది.ఇందులో భాగంగా వామ్మో… రాక్షసి వి అక్క నువ్వు.అలాగే చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటూ కామెంట్ చేసింది.దీంతో నటి ప్రగతి కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ” నవ్వుతూ లవ్ సింబల్స్” ని ట్యాగ్ చేసింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి నీలిమ సాయి తెలుగులో కంటే ఎక్కువగా తమిళం, మళయాళం తదితర భాషలలో నటించి ప్రేక్షకులను అలరించింది.అంతేకాకుండా పలు బుల్లితెరలో కూడా నటించి యూట్యూబ్ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది.
ఇక నటి ప్రగతి విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో నటిస్తోంది.అంతే కాకుండా మరిన్ని టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తోంది.