టాలీవుడ్ బుల్లితెర పై ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ విజయవంతంగా నాలుగు సీజన్లలను పూర్తి చేసుకొని 5వ సీజన్ లో అడుగు పెట్టింది.అయితే గత ఏడాది కరోనా వైరస్ కారణంగా స్టార్ సెలబ్రెటీలు బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో చాలా చప్పగా సాగింది.
దీంతో ఈ ఎఫెక్ట్ బిగ్ బాస్ షో టిఆర్పి రేటింగ్ పై కూడా పడింది.దీంతో షో నిర్వాహకులు ఈ ఏడాది సెలబ్రేటీ వేటలో పడి బాగానే కలర్ ఫుల్ గా మొదలు పెట్టారు.
అయితే ఇందులో ఇప్పటికే తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మామిళ్ల శైలజా ప్రియా, అర్జున్ రెడ్డి ఫేమ్ లహరి శరి, 7ఆర్ట్స్ సరయూ, ప్రముఖ మేల్ యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్టు ఉమా, ఆర్జే కాజల్, షణ్ముఖ్ జస్వంత్ మరియు ఇతరులు పాల్గొంటున్నట్లు ఇప్పటికే షో నిర్వాహకులు తెలియజేస్తూ ఈనెల 5వ తారీఖున ఘనంగా మొదలు పెట్టారు.
అయితే తాజాగా ఈ బిగ్ బాస్ షో గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో పెద్ద చర్చ జరుగుతోంది.
అయితే ఇంతకీ ఆ విషయం ఏమిటంటే నిన్న మొన్నటి వరకు ఈ షోలో టాలీవుడ్ ప్రముఖ మరియు అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టులైన సురేఖ వాణి మరియు ప్రగతి తదితరులు కూడా బిగ్ బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు పెద్దగా చర్చలు జరిగాయి.అంతేకాకుండా కొందరైతే ఏకంగా సురేఖ వాణి మరియు ప్రగతిలను బిగ్ బాస్ షోలో తీసుకుంటారా.? లేదా.? అంటూ పోల్ మరియు ఓటింగులతో నానా హంగామా చేశారు.
తీరా బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల లిస్టులో ప్రగతి మరియు సురేఖల పేర్లు లేకపోవడంతో వీరిద్దరి అభిమానులు బిగ్ బాస్ షో నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా సురేఖ వాణి మరియు ప్రగతిలను బిగ్ బాస్ షో లోకి తీసుకురావాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.మరి ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుల విన్నపాలను షో నిర్వాహకులు పట్టించుకుంటారో లేదో చూడాలి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 5వ సీజన్లో హోస్ట్ గా వ్యవహరించేందుకు మొదటగా షో నిర్వాహకులు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంప్రదించినప్పటికీ ప్రస్తుతం ఎన్టీఆర్ జెమినీ టీవీలో ప్రసారమయ్యే “ఎవరు మీలో కోటీశ్వరుడు షో” లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నడంతో ఆ అవకాశం నాగార్జునను వరించినట్లు సమాచారం.