అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యే చి.ల.సౌ స్రవంతి అనే ధారావాహిక ఎంతగా పాపులర్ అయిందో ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ ధారావాహిక ద్వారా నటిగా బుల్లి తెరకు పరిచయమైన సీరియల్ నటి మీనా కుమారి గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.
అయితే ఈమె మొదటగా బుల్లి తెరలో నటించే అవకాశం దక్కించుకొని ఆ తర్వాత వెండితెర మీద కూడా అక్క, వదిన, చెల్లెలు, తదితర పాత్రలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు నటి మీనా కుమారి రియల్ లైఫ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం…
నటి మీనా కుమారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగింది.
మీనా కుమారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి.ఈమె తల్లి ఇంటి పట్టునే ఉంటూ కుటుంబ బాధ్యతలను చక్కబెట్టేది.అయితే చదువు పూర్తియిన తరువాత మీనా కుమారి తెలిసిన వారి ద్వారా చి.ల.సౌ స్రవంతి సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకుంది.ఈ క్రమంలో పలు సీరియళ్ళలో ప్రాధాన్యత కలిగిన పాత్రలలో నటించిన నటుడు వాసు ని పెళ్లి చేసుకుంది.
అయితే వాసు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ తదితర భాషల కి సంబంధించిన ధారావాహికలలో నటించి, ఇప్పటికీ నటిస్తూ సీరియల్ హీరోగా బాగానే రాణిస్తున్నాడు.ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే ప్రస్తుతం మీనా కుమారి ఒకపక్క సీరియళ్లలో నటిస్తూనే మరో పక్క పలు చిత్రాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
అయితే తెలుగులో మీనా కుమారి విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, కింగ్ నాగార్జున, తదితర స్టార్ హీరోలతో కలిసి పని చేసింది.
ఒకప్పుడు పలు ధారావాహికల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన నటి మీరా కుమారిని బుల్లితెర అభిమానులు తమ ఇంట్లో మనిషిలా అభిమానించేవారు. అంతలా మీనా కుమారి తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంది.