హిమ దాస్ గురించి మన స్టార్ హీరోలు ఏమని ట్వీట్ చేసారంటే.?

అసోంకి చెందిన 18 ఏళ్ల హిమదాస్ ఫైనల్లో 400 మీటర్ల పరుగుని కేవలం 51.46 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఆమె తర్వాత స్థానంలో రొమేనియా అథ్లెట్ మిక్లో 52.07 సెకన్ల‌తో రజతం గెలవగా.అమెరికాకి చెందిన టేలర్ మన్సన్ 52.28 సెకన్లతో కాంస్యానికి పరిమితమైంది.స్వర్ణపతాకాన్ని గెలిచిన హిమ దాస్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అభినందలతో ముంచెత్తారు.హిమాదాస్.దేశం నిన్ను చూసి గర్విస్తోందని… అభినందనలు అని మోడీ ట్వీట్‌ చేశారు.ఈ విజయం నిశ్చయంగా యువ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిస్తుందన్నారు.

తను చేసిన కఠోర శ్రమకు భగవంతుని అనుగ్రహం, 130 కోట్ల మంది దేశ ప్రజల ఆశీస్సులు తోడవడంతో 400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాన్ని సాధించిన #హిమదాస్.ఆమెకు పతకాన్ని అందిస్తూ #జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సందర్భంలో భావోద్వేగానికి గురై #కళ్ళనీళ్ళు జాలువాతున్న ద్రృశ్యం.

అస్సాంలో ఏపుగా పెరిగి వరిపొలాల మధ్య బురదలో చిరుతపులి లా పరుగులెత్తే రెండు కాళ్ళు.ఆరుగురు పిల్లలున్న కుటుంబం లో అందరికంటే చిన్న అయినా, బరువు భాధ్యతలు మాత్రం ఎక్కువే.పేదరికంతో చేతికి.నోటికి మధ్య పరుగు అలవాటైన నేపధ్యమే.పేదరికం భలే విచిత్రమైనది, ముఖ్యంగా అమ్మాయిలకు.అది వారి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసి, ముడుచుకుపోయేలా చేసి, మగవారి దాష్టికానికి బలవ్వటం కోసమే పుట్టాం అనుకోనేంత దుర్భలస్థితికి తోసేయ్యెచ్చు.

అదేసమయంలో మగవారితో సమానంగా కాయకష్టం చేసి, మగవారిని కూడా సవాల్ చేసే టామ్ బాయ్ గా ఎదిగేంత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వచ్చు.ఈ అమ్మాయి అలాగే ఆత్మ విశ్వాసం తో ఎదిగింది.

తన కాళ్ళను తాను నమ్ముకుంది.తన నడక ను పరుగుగా మార్చుకుంది.ముందుగా ఫుట్ బాల్ ఆడటం ప్రారంభించినా, తన పరుగును గోల్ పోస్ట్ నుండి ట్రాక్ మీదకు మార్చుకుంది.పరిగెత్తింది.

వేగంగా పరిగెత్తింది.ఇంకా వేగంగా.

ప్రపంచంలో అందరికంటే వేగంగా.కేవలం 18 ఏళ్ళ వయసులో ప్రపంచాన్ని జయించింది.

భారతదేశ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు సగర్వంగా ఎగరవేసింది.

ఆ అమ్మాయే హిమదాస్.భారతదేశానికి బంగారు పథకం అందించిన మొదటి మహిళ.IAAF world under 20 అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో 400 మీటర్ల విజేత.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లు సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తిని ముగ్గూరు కలిసి అభినందించారు.జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో భారతీయ క్రీడాకారిణి హిమదాస్ సంచలనం తాజాగా సృష్టించింది.

ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో భారత్ కు స్వర్ణ పతకం సాధించిపెట్టింది.ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో ఈ ఫీట్ సాధించింది.ఈ అరుదైన ఘనతను సాధించిన హిమ దాస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ సందర్భంగా మన ముగ్గురూ స్టార్ హీరోలు కూడా విషెస్ చెప్పి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు.

హిమదాస్ కు సెల్యూట్ : రాంచరణ్

‘హిమదాస్ కు సెల్యూట్.మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు.ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచారు.దేశం యావత్తు మీకు సెల్యూట్ చేస్తోంది’ అని తన ఫేస్ బుక్ ఖాతాలో రాంచరణ్ పోస్ట్ చేశాడు.

గర్వంగా.సంతోషంగా ఉంది : మహేష్ బాబు

‘భారత క్రీడారంగంలోనే అత్యంత అరుదైన విజయాల్లో ఇదీ ఒకటి.హిమదాస్ అద్భుత ప్రతిభ కనబరిచింది.చాలా గర్వంగా.సంతోషంగా ఉంది.కంగ్రాట్స్ హిమదాస్’ అంటూ మహేష్ ట్వీట్ చేసి అభినందించారు.

హిమదాస్ చరిత్ర సృష్టించింది: ఎన్టీఆర్

‘చరిత్ర సృష్టించిన హిమదాస్ కు హృదయపూర్వక అభినందనలు.ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో స్వర్ణం నెగ్గిన అథ్లెట్ గా నిలిచారు.ఇది గొప్ప సంతోషకరమైన సమయం’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.ఇలా ముగ్గురు టాప్ హీరోలు ఒకేసారి ఒకవ్యక్తిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేయడంతో ఎవరా అథ్లెట్ .? ఆమె ఏం సాధించారని అందరూ ఆరాతీస్తున్నారు.దేశం కోసం పథకం తెచ్చిన హిమకు ఈ టాలీవుడ్ హీరోలు విషెస్ చెప్పి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube