తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ చివరి దశకు వచ్చేసింది.ఈ వారంలో సీజన్ గ్రాండ్ ఫినాలే నిర్వహించబోతున్నారు.
సాదారణంగా అయితే గ్రాండ్ ఫినాలే వరకు హౌస్ లో కంటెస్టెంట్స్ అయిదు మంది మాత్రమే ఉండాలి.కాని ఈసారి మాత్రం అబ్బాయిలు అఖిల్, శివ, అనీల్, బాబా మాస్టర్ లు ఉన్నారు.
ఇక అమ్మాయిలు బిందు మాధవి, అరియానా మరియు మిత్ర శర్మలు ఉన్నారు.ఈ ఏడుగురు కూడా ఫైనల్ వారంకు చేరుకున్నారు.
ఇలా ఫైనల్ వారంకు ఏడుగురు కంటెస్ట్రెంట్స్ రావడం ఏంట్రా బాబు అంటూ బిగ్ బాస్ టీమ్ ను సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో బిగ్ బాస్ నాన్ స్టాప్ కు సంబంధించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.
అందులో ప్రథానంగా ఈ సారి బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను మూడు రోజుల పాటు చిత్రీకరిస్తారట.గురువారం మొదలుకుని శనివారం వరకు ఎపిసోడ్స్ ను కంటిన్యూ చేస్తారు.
మొదట ఇద్దరు కంటెస్టెంట్స్ ను గురు వారమే బటకు తీసుకు వచ్చేస్తారు.అది శుక్రవారం ఎపిసోడ్ లో చూపిస్తారు.
శని వారం ఎపిసోడ్ లో గ్రాండ్ ఫినాలే జరుగబోతుంది అంటూ సమాచారం అందుతోంది.
మొదటి ఇద్దరు ఎవరు అనే విషయంలో ఒక స్పష్టత అయితే ఉంది.
బాబా మాస్టర్ మరియు మిత్ర లు బయటకు వచ్చేస్తారు.ఇక మిగిలిన వారు అఖిల్, బిందు మాధవి, శివ, అనీల్ మరియు అరియానాలు ఫైనల్ 5 కి వెళ్తారు.
వారిలో ఒకరు గెలుస్తారు.వారు ఎవరు అనే విషయంలో కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
గతంలో మాదిరిగా విన్నర్ ఎవరు అనే విషయంలో ఒక స్పష్టత కనిపించడం లేదు.ఎక్కువ శాతం వారు.
వీరు అని లేదు.బిందు మాధవి, శివ మరియు అఖిల్ లలో ఒకరికి ట్రోఫీ అందుతుంది.
అది ఎవరికి అనే విషయంలో స్పష్టత లేదు.యాంకర్ శివ రేసులో లేకుండా ఉంటే కచ్చితంగా బిందు మాధవికి ఎక్కువ అవకాశం ఉండేది.
కాని ఇప్పుడు బిందు మాధవి మరియు శివలు ఓట్లు షేర్ చేసుకుంటున్నారు కనుక అఖిల్ విజేత అయ్యే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.మొత్తానికి ఏం జరుగుతుందో తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.