తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ప్రయోగాత్మకంగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ ఇప్పటికే స్టార్ మా ద్వారా సుపరిచితం.
అయిదు సీజన్ లు కూడా మంచి విజయాలు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.అందుకే బిగ్ బాస్ నాన్ స్టాప్ తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేశారు.
నాన్ స్టాప్ కు కూడా నాగార్జున హోస్ట్ అవ్వడం వల్ల మరింతగా సక్సెస్ ఖాయం అన్నారు.ఇక ఈ సీజన్ ప్రారంభం లో లైవ్ అన్నారు.
దాన్ని కొనసాగించలేక పోతున్నట్లుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు లైవ్ ను తొలగించారు.ఆ తర్వాత మళ్లీ లైవ్ ను కొనసాగించడం జరిగింది.
ఆ లైవ్ కూడా ఫేక్ అన్నట్లుగానే సాగింది.
ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నారు అనే విమర్శలు వచ్చాయి.
ఏం చేసినా కూడా ప్రేక్షకులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు రప్పించలేక పోయారు.దాంతో అనుకున్నదాని కంటే కాస్త ముందుగానే షో ను ఎండ్ చేస్తున్నారు.
ఈ షో అట్టర్ ప్లాప్ అయ్యింది అని చెప్పడానికి మరో నిదర్శణం ఎపిసోడ్ టెలికాస్ట్ కు రెండు మూడు రోజుల ముందే షో కు సంబంధించిన విషయాలు లీక్ అయ్యాయి.ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ ఎవరు అనే విషయం అప్పుడే తేలిపోయింది.
బిందు మాధవి ని విన్నర్ గా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇంత ముందుగానే విన్నర్ ఎవరు అని తేలితే జనాలకు చూసే ఆసక్తి ఉంటుందా చెప్పండి.
అందుకే బిగ్ బాస్ నాన్ స్టాప్ అట్టర్ ప్లాప్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.