తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 సగం రోజులకు చేరుకుంది.షో సాదారణంగా ప్రారంభం అయిన రెండు మూడు వారాల్లోనే విజేత ఎవరు అనే విషయమై ఒక క్లారిటీ గత సీజన్ ల్లో వచ్చేది.
కాని ఈ సీజన్ లో మాత్రం ఇప్పటి వరకు విన్నర్ ఎవరు.ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు అయ్యి ఉంటారు అనే ఒక అంచనాకు విశ్లేషకులు కూడా రాలేక పోతున్నారు.
అంతగా బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ గందరగోళంను క్రియేట్ చేస్తున్నారు.ఎట్టకేలకు సన్నీ ఒక ఫైనల్ కంటెస్టెంట్ అంటూ నిరూపితం అయ్యింది.
సన్నీ ఈమద్య బాగా ఆడుతున్నాడు.మొదట్లో అతడి ఆట పెద్దగా కనిపించక పోయేది.
కాని ఆయన్ను హైలైట్ అయ్యేలా చేసింది ప్రియా తో వివాదం.తాజా ఎపిసోడ్ లో ప్రియా తన కన్నింగ్ తెలివితో సన్నీని ఇరికించే ప్రయత్నం చేసింది.
ఇక నేటి ఎపిసోడ్ లో ఫిజికల్ అయ్యేంతగా వివాదాన్ని లాగేందుకు ప్రయత్నించింది.
సన్నీ కష్టపడి గుడ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే.అతడి బుట్ట నుండి ఈజీగా గుడ్లు లాగేసుకునేందుకు ప్రయత్నించింది.దాంతో సన్నీ చాలా సీరియస్ అయ్యాడు.
ఇద్దరు కూడా చాలా సీరియస్ గా మాట్లాడుకున్నారు.ప్రియా పదే పదే చెంప పగులుద్ది అంటూ సన్నీని అంది.
దాంతో అతడు కూడా సీరియస్ అయ్యాడు.మొత్తంగా ప్రియా వల్ల సన్నీ యొక్క వెయిట్ పెరుగుతుంది కాని తగ్గడం లేదు.
సోషల్ మీడియాలో సన్నీకి అనూహ్యంగా మద్దతు పెరిగింది.ప్రియా మరీ ఇలా చిల్లరగా వ్యవహరిస్తుంది ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ ల్లో ఇలాంటి ఒక చెత్త కంటెస్టెంట్ ను చూడలేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ప్రియా దెబ్బతో సన్నీకి ఫైనల్ బెర్త్ ఖరారు అయినట్లే అంటున్నారు.
ఇక ప్రియాకు అస్సాం టికెట్ బుక్ అయ్యింది.ఇక ఆమె వెళ్లడమే అంటున్నారు.
తాజా వార్తలు