తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 5వ వారం లోకి అడుగు పెట్టింది.ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, టీవీ9 దేవి మరియు స్వాతి దీక్షిత్ లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ భిన్నంగా జరిగింది.ఒక్కొక్క ఇంటి సభ్యుడు ఇద్దరు చొప్పున సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది అందులో భాగంగా అభిజిత్ తన వంతుగా అఖిల్ ను నామినేట్ చేస్తున్న సమయంలో చర్చ సీరియస్ పరిణామాలకు దారి తీసింది.
ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి మధ్యలో మోనాల్ ను తీసుకొని రావడం జరిగింది.ఆమె పేరును ఉపయోగిస్తూ ఇద్దరు మాటల యుద్దం చేసుకున్నారు.
దాంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.మీ ఇద్దరి మధ్యలో నన్ను ఎందుకు తీసుకు వస్తున్నారు.
నా విషయమై మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.దాంతో ఇంటి సభ్యులు అంతా కూడా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.వీరిద్దరితో క్లోజ్ గా ఉంటుందని అందరికీ తెలిసిందే.ఆ విషయమై ఇద్దరి మధ్య మొదటి నుండి కూడా ఈగో నడుస్తూ ఉంది.
ఈ వారం వారిద్దరి మధ్య అది మరింత ముదిరినట్లు నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తో తెలుస్తుంది.నేటి ఎపిసోడ్ లో ఇద్దరి మధ్య చాలా సీరియస్ గొడవ అయితే షో మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉందంటున్నారు.
నేటి ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.ఇంతకు ముందులాగా నీరుగార్చుతారా లేదంటే ఇద్దరి మధ్య గొడవ హాట్ హాట్ గా జరిగే అందరికీ ఎంటర్టైన్ చేస్తుందా అనేది చూడాలి.
ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.