తెలుగు బిగ్బాస్ వీకెండ్ ఎపిసోడ్ లకు అంతో ఇంతో రేటింగ్ వచ్చినా వీక్ ఎపిసోడ్స్ కు మాత్రం చాలా వీక్ రేటింగ్ వస్తున్న విషయం అందరికి తెల్సిందే.వీకెండ్ లో గెస్ట్ లతో మ్యానేజ్ చేస్తున్న బిగ్ బాస్ టీం వీక్ డేస్ ల్లో మంచి టాస్క్ లు ఇవ్వలేక పోతున్నారు.
క్రియేటివ్ టీం ఏం చేస్తున్నారో అర్థం కానంతగా బిగ్ బాస్ స్కిట్ లు ఎపిసోడ్ లు ఉంటున్నాయి.ఈ ఫ్రస్టేషన్ లో వారు మరీ దారుణమైన క్రూరమైన టాస్క్ లు మరియు చాలా దారుణమైన ఆటలు ఇస్తున్నారు.
కొన్ని సార్లు ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు కొట్టుకునేలా మరోసారి ఒకరిపై ఒకరికి పిచ్చి కోపం కలిగేలా టాస్క్ లు ఉంటున్నాయి.సాదారణంగా అయితే ప్రతి ఒక్కరికి ఇంటి నుండి అమ్మా నాన్న లేదా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా లేటర్ రాస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆ లెటర్ ను వారికి చించి పంపిస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు దీపావళి గిప్ట్ కింద కుటుంబ సభ్యుల నుండి వచ్చిన లెటర్స్ ను అందించారు.ఆ లెటర్స్ అందుకోవాలంటే మొదటగా తన జీవితంలోని సీక్రెట్ ను చెప్పాల్సి ఉంటుంది.ఆ సీక్రెట్ అప్పటి వరకు ఎవరికి చెప్పనిది మరియు ఆ సీక్రెట్ ముందుగా ఎవరికతో షేర్ చేసుకోకుండా ఇప్పుడే ఎక్స్ క్లూజివ్గా ఉండేది అయ్యి ఉండాలి.
అఖిల్ కు ఈ విషయంలో బిగ్ బాస్ టాస్క్ ఇచ్చి వారు నిజం చెప్పారా లేదా అనేది నిర్ణయించుకుని ఉత్తరాలు పంపాలా లేదా అనేది నిర్ణయించుకుని ఇవ్వాల్సి ఉంటుంది.సభ్యులు అయిన మెహబూబ్, సోహెల్, అభిజిత్, హారిక, లాస్య మరియు మోనాల్లు చెప్పిన సీక్రెట్ లు జెన్యూన్గా అనిపించడంతో అఖిల్ వారికి ఉత్తరాలు పంపించాడు.
కాని అవినాష్ సినిమా ఆఫర్ పేరుతో తాను మోసపోయిన విషయంను చెప్పాడు.ఆ విషయం తనకు కూడా తెలుసు కాబట్టి అది సీక్రెట్ అవ్వదు అంటూ అఖిల్ అతడి లేఖను చించేశాడు.ఇక అరియానా సీక్రెట్ గురించి కాకుండా ఒక రాత్రి సమయంలో జరిగిన యాక్సిడెంట్ ను చెప్పింది.అది సీక్రెట్ అవ్వదు.కనుక ఆమెకు లెటర్ పంపించలేదు.లెటర్ పంపించకున్నా పర్వాలేదు కాని పీస్ లుగా చేసిన దాన్ని పంపించడం ఏంటీ అంటూ ప్రేక్షకులు విమర్శలు వ్యక్తం చేశారు.
ఇంటి సభ్యులు పంపిన లేఖ పీసులుగా రావడం పట్ల వారు ఎంతగా బాధ పడ్డారో అర్థం చేసుకోవచ్చు.అందుకే ప్రేక్షకులు ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నారురా బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.