తెలుగు ప్రేక్షకుల ఆధరణ కోల్పోయిన బిగ్బాస్ సీజన్ 3కి మళ్లీ ఆధరణ తీసుకు వచ్చేందుకు నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.మొదటి రెండు సీజన్లకు మంచి రేటింగ్ రాగా ఈ సీజన్కు మాత్రం పెద్దగా ఆధరణ కరువయ్యింది.
తెలుగుకు చెందిన ప్రముఖ సెలబ్రెటీలు ఈ సీజన్లో ఉన్నారు.అయినా కూడా అంతా చాలా సేఫ్గానే గేమ్ ఆడటం వల్ల పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నారు.
ఇక సీజన్ ఆరంభంలో ఏకంగా రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ రాగా ఇప్పుడు మాత్రం దారుణమైన రేటింగ్స్ నమోదు అవుతున్నాయి.
సీజన్ను గౌరవప్రధమైన రేటింగ్తో ముగించాలని నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.కాని బిగ్బాస్ ప్రయత్నాలు అన్ని విఫలం అవుతున్నాయి.బిగ్బాస్ ఎక్కువగా సెంటిమెంట్తో దెబ్బ కొట్టి ప్రేక్షకులకు బిగ్బాస్ నచ్చే విధంగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు.
అందుకోసం ప్రతి రోజు లేదంటే రెండు మూడు రోజులకు ఒకసారి చొప్పున ఏడిపిస్తూనే ఉన్నాడు.ఒకవేళ బిగ్బాస్ ఏడిపించకున్నా వారిలో వారే ఏదో ఒక గొడవ లేదంటే చిన్న విషయానికి కూడా ఏడ్చేస్తున్నారు.
ఏడ్చి ఏడ్చి షోను కంపు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.తెలుగు బిగ్బాస్ సీజన్ 3 మొత్తం కూడా ఏడుపుల మయం అయ్యిందని అంటున్నారు.శివ జ్యోతి ఏడుపుకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది.
ఆమె ఏడుపులపై సోషల్ మీడియాలో కామెంట్స్ ఏ స్థాయిలో వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక శ్రీముఖి చాలా స్ట్రాంగ్గా కనిపించినా కూడా ఊరికే ఏడుస్తూనే ఉంది.నిన్నటి ఎపిసోడ్లో ఆమె తమ్ముడు కనిపించిన వెంటనే ఏడుపు ఆపుకోలేక పోయింది.
ఆమె ఏడుపు సోషల్ మీడియాలో కామెడీ అయ్యింది.
.