తెలుగులో ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “ఆర్ఎక్స్100” చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం పంజాబీ బ్యూటీ “పాయల్ రాజ్ పుత్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు ఇప్పటి వరకు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం గ్లామర్ కి ప్రాధాన్యత ఉండడంతో తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాలేదు.
దీంతో తనకంటూ సినీ కెరీర్ లో చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతో కొంతమేర సతమతమవుతోంది.
అయితే ఎప్పుడూ సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండేటువంటి పాయల్ రాజ్ పుత్ అప్పుడప్పుడు పలు సంస్థల ఉత్పత్తుల ప్రకటనలను కూడా తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రమోట్ చేస్తుంటుంది.
అయితే తాజాగా ప్రముఖ మద్యం ఉత్పత్తి సంస్థ అయిన “రాయల్ చాలెంజ్” మద్యం బ్రాండ్లని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రమోట్ చేసింది.
అంతేగాక రాయల్ చాలెంజ్ మద్యం యొక్క విశిష్టతలను తెలుపుతూ ఓ పోస్ట్ ని కూడా షేర్ చేసింది.
దీంతో కొందరు నెటిజన్లు పాయల్ రాజ్ పుత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వ ప్రచారం చేస్తుండడంతో మళ్లీ సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా ముద్యం బ్రాండ్లని ప్రమోట్ చేయడమేంటని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య కాలంలో ఈ అమ్మడు విక్టరీ వెంకటేష్ కి జోడీగా “వెంకీమామ” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి హిట్ కొట్టినప్పటికీ వెంటనే “డిస్కో రాజా” చిత్రం రూపంలో ప్లాప్ వెంటాడింది. దీంతో పాయల్ రాజ్ పుత్ తన తదుపరి చిత్రం కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.కాగా ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తమిళంలో ఏంజెల్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న “నరేంద్ర” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.