సినిమా పరిశ్రమలో రాణించాలంటే అందం, అభినయంతోపాటూ కథల పట్ల నిర్ణయాలు అలాగే కెరియర్ పట్ల జాగ్రత్తలు చాలా అవసరం.ఒకవేళ నటీనటులు తాను నటించే చిత్రాల కథల పట్ల లేదా పాత్రల పట్ల సరైన నిర్ణయం తీసుకోకపోతే సినీ కెరియర్ పూర్తిగా ముగిసి పోయినట్లే.
కాగా తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు “పల్నాటి సూర్య ప్రతాప్” దర్శకత్వం వహించిన “కుమారి 21ఎఫ్” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన యంగ్ బ్యూటీ “హెబ్బా పటేల్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే మంచి హిట్ ని అందుకోవడంతో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంది.
ఈ క్రమంలో ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, తదితర చిత్రాలతో బాగానే అలరించింది.కానీ ఆ తర్వాత కథల పట్ల అవగాహన లోపించడంతో అందగాడు, మిస్టర్, ఏంజెల్, 24 కిస్సెస్, తదితర చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లను ఎదుర్కొంది.
దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడి సినీ కెరీర్ పై పడింది.దీంతో హీరోయిన్ గా సినిమా అవకాశాలను కోల్పోయింది.కానీ తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని తన ఉనికిని చాటుకునేందుకు పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించేందుకు సిద్ధమైంది.ఈ క్రమంలో భీష్మ, రెడ్ తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించింది.
కానీ ఇక్కడ కూడా ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు.
దీంతో ఈ మధ్య హెబ్బా పటేల్ ఫిట్నెస్ ని మెరుగు పరుచుకుని మళ్లీ హీరోయిన్ గా అవకాశాలు సంపాదించేందుకు సన్నద్ధమవుతోంది.
ఈ క్రమంలో బరువు తగ్గేందుకు జిమ్ లో బాగానే కష్టపడుతోంది.అంతే కాకుండా ప్రత్యేకంగా ఆహారపు అలవాట్లను కూడా పాటిస్తోంది.కాగా ఇటీవలే ఈ అమ్మడు జిమ్ లో వర్కవుట్లు చేస్తున్న సమయంలో తీసినటువంటి వీడియోని తన అధికారిక షేర్ చేసింది.మరి మునుపటిలాగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా అలరిస్తుందో లేదో చూడాలి.
కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో “ఓదెల రైల్వే స్టేషన్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “సంపత్ నంది” కథను అందించాడు.కాగా ఈ చిత్రంలో హీరోగా కేజీఎఫ్ చిత్ర ఫేమ్ “వశిష్ఠ ఎన్ సింహ” నటిస్తున్నాడు.