తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమా ను థియేటర్ లో ఎక్స్ పీరియన్స్ చేయడం మిస్ అవ్వబోతున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న దృశ్యం 2 ను ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో వెంకటేష్ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
దృశ్యం కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో సహజంగానే దృశ్యం 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.అంచనాలు భారీ ఎత్తున ఉన్న ఈ నేపథ్యంలో సినిమా ను థియేటర్ రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా 50 కోట్లకు మించిన షేర్ ను ఈ సినిమా దక్కించుకునేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
ఇక ఈ సినిమా తాజాగా థియేట్రికల్ రిలీజ్ కు సంబంధించిన విషయం పై నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని జనాలు తప్పుబడుతూనే ఉన్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ వచ్చింది.
సినిమాపై ఉన్న అంచనాలు ఆ ట్రైలర్ మరింతగా పెంచాయి అనడంలో సందేహం లేదు.పెద్ద ఎత్తున అంచనాలున్న దృశ్యం 2 ను మరింత భారీగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను అమెజాన్ ప్రైమ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
ట్రైలర్ ను చక్కగా కట్ చేసి వదిలారు.ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.
భారీ అంచనాలున్న ఈ సినిమా లో మీనా ప్రథాన పాత్రలో నటించింది.దృశ్యం లో ఎవరు అయితే ఉన్నారో వారే ఈ సినిమా లో కనిపించబోతున్నారు.ఇక జబర్దస్త్ కమెడియన్స్ కొందరు కూడా ఈ సినిమా లో కాస్త కామెడీ కోసం జొప్పించబడ్డారు.దృశ్యం 2 ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని.దృశ్యం ను మించిన మంచి థ్రిల్లర్ మూవీ అంటూ ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది కనుక ఈ సినిమా ను థియేటర్ లో చూడటం మిస్ అవ్వబోతున్నాం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సురేష్ బాబు ఈ విషయంలో ఖచ్చితంగా తన సమాధానం చెప్పాల్సిందే అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.