తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు దర్శకుడు పోసాని కృష్ణమురళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ గర్భవతి ని చేసి చివరికి 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆమెకు అబార్షన్ చేయించాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.దీంతో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ పేరు బలంగా వినిపిస్తోంది.
కాగా తాజాగా ఈ విషయం పై తెలుగు యాంకర్ “శ్వేతా రెడ్డి” సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించింది.
ఇందులో భాగంగా అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ ని గర్భవతి ని చేసి అబార్షన్ చేయించిన విషయం సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా అందరికీ తెలుసని ఆ విషయంపై ఇప్పుడు చర్చించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పోసాని కృష్ణ మురళి పై దాడి చేసిన విషయం గురించి స్పందిస్తూ ఈ మధ్య కాలంలో నిజాలు బయట పెట్టిన వాళ్ళని చంపేస్తున్నారని ఈ క్రమంలోనే నటి శ్రీ రెడ్డి మరియు రామ్ గోపాల్ వర్మ వంటి వారిని కూడా చంపేస్తున్నారని ఇది సరికాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది.అయితే పూనమ్ కౌర్ విషయంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు పాత్ర కూడా ఉందని ఆ విషయం గురించి కూడా తొందర్లోనే నిజాలు బయట పడతాయని చెప్పుకొచ్చింది.
దీంతో ఈ విషయంపై స్పందిస్తూ ఈ మధ్య కాలంలో యాంకర్ శ్వేతా రెడ్డి కి మతి స్థిమితం సరిగ్గా లేదని అందువల్లనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలపై కూడా కామెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి నిజంగా దమ్ముంటే రాజకీయాలు చేయాలని లేకపోతే జనసేన పార్టీని అమ్మేసి ఇంట్లో కూర్చోవాలంటూ ఘాటుగా విమర్శించింది.ఇక మెగాస్టార్ చిరంజీవి పై కూడా విమర్శిస్తూ కనీసం పవన్ కళ్యాణ్ కి మీరైనా చెప్పండి చిరంజీవి గారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసింది.