ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ లో ప్రసారమయ్యే పటాస్ షో లో తన గల గల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టువంటి టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీ ముఖి గురించి సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రాములమ్మ పాటకి డాన్సులు వేస్తూ బాగానే అలరించడంతో అందరూ బుల్లితెర రాములమ్మ అంటూ కితాబిచ్చారు.
అయితే తాజాగా యాంకర్ శ్రీముఖి గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఇటీవలే యాంకర్ శ్రీముఖి తన అధికారిక ఇంస్టాగ్రామ్ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈ ఫోటోని షేర్ చేసింది.
అయితే ఈ ఫోటోలో శ్రీముఖి మంగళ సూత్రం ధరించి ఉండడంతో నెటిజన్లు శ్రీముఖి కి పెళ్లి అయిపోయిందా అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.దీంతో శ్రీముఖి ఆ ఫోటో ను వెంటనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి తొలగించినట్లు సమాచారం.
అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం సినిమా షూటింగులో భాగంగా పెళ్లి అయిన యువతి పాత్రలో నటించేటప్పుడు తీసుకున్నటువంటి ఫోటోని శ్రీముఖి ఇప్పుడు షేర్ చేసి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి బుల్లితెర రాములమ్మ అ తన పెళ్లి వార్తను వస్తున్నటువంటి వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
అయితే ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి పలు టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే ఈ టీవీ మరియు జీ తెలుగు చానెల్ లో ప్రసారమయ్యే పలు షో లకి యాంకరింగ్ నిర్వహిస్తోంది.