టాలీవుడ్ బుల్లితెరపై పలు షోలు, ఈవెంట్ల ద్వారా యాంకరింగ్ నిర్వహించి యాంకర్ గా బాగానే గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ “శ్యామల” గురించి సినీ ప్రేక్షకులకి దాదాపుగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్ శ్యామల కేవలం బ్యాంకింగ్ రంగంలో మాత్రమే కాకుండా పలు చిత్రాలు మరియు సీరియల్స్ లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి వెండి తెర పై కూడా ప్రేక్షకులను బాగా అలరించింది.
కాగా యాంకర్ శ్యామల పలు తెలుగు సీరియల్స్ లో హీరో గా నటించిన ప్రముఖ సీరియల్ నటుడు “నరసింహ” ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే ఇటీవలే నరసింహ ఓ చీటింగ్ కేసులో అరెస్టయి మళ్లీ విడుదలయ్యాడు.
కాగా యాంకర్ శ్యామల ప్రస్తుతం పలు షోలు, ఈవెంట్లు, చిత్రాలు అంటూ బిజీబిజీగా గడుపుతోంది.అయితే తాజాగా యాంకర్ శ్యామల రెమ్యునరేషన్ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే యాంకర్ శ్యామల ఈవెంట్ మరియు షోలలో యాంకరింగ్ నిర్వహించేందుకు దాదాపుగా 50 నుంచి 65 వేల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ఇక చిత్రాల్లో నటించడానికి కూడా రోజుకి దాదాపుగా అర లక్ష రూపాయలు చార్జి చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఇదో కోవలోనే ప్రముఖ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “రాఖీ” చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించిన యాంకర్ “మంజూష” కూడా యాంకరింగ్ రంగంలో బాగానే రాణిస్తోంది.
అయితే ఈ అమ్మడు కూడా రోజుకి దాదాపుగా 60 నుంచి 75 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నట్లు సమాచారం.అయితే ఒకప్పుడు యాంకరింగ్ రంగంలో పెద్దగా కాంపిటీషన్ లేకపోవడంతో సీనియర్ యాంకర్ అయిన ఉదయభాను, ఝాన్సీ, సుమ, వంటి వాళ్లు బాగానే డబ్బు వెనుకేసుకున్నారు.కానీ ఈ మధ్య కాలంలో యాంకరింగ్ రంగంలో కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది.
దీనికితోడు యూట్యూబ్ లో రోజుకో కొత్త యాంకర్ పుట్టుకొస్తోంది.