తెలుగులో ఒకప్పుడు పలువురు సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ మలయాళ హీరోయిన్ “ఊర్వశి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటి ఊర్వశి మలయాళ భాషకి చెందిన నటి అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.
దీంతో దాదాపుగా 150 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి బాగానే అలరిస్తోంది.అయితే నటి ఊర్వశి కుటుంబ సభ్యులు చిత్ర పరిశ్రమకు చెందిన వారు కావడంతో ఈమె నటి పరిచయం సులభంగానే జరిగింది.
కాగా అప్పట్లో ఊర్వశి సోదరీమణులైన కళారంజని, కల్పన లు కూడా మలయాళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లు గా రాణించారు.
అయితే ఇప్పటి వరకు నటి ఊర్వశి గురించి ఊర్వశి తమ్ముడు కూడా తెలుగు చిత్రాల్లో నటించాడని చాలా మందికి తెలియదు.
కాగా నటి ఊర్వశి సోదరుడి పేరు నందు.ఇతడు అప్పట్లో 1, 2 అడల్ట్ చిత్రాలలో హీరోగా నటించాడు.కాగా ఇందులో “లయనం” అనే చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.దీంతో అందరూ నందు హీరోగా బాగానే క్లిక్ అవుతాడని అనుకున్నారు.
కానీ దురదృష్టవశాత్తు నందు 26 ఏళ్ళ వయసులో పలు ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందాడు.ఒక్కసారిగా ఊర్వశి కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది.
అలాగే నటి ఊర్వశి మరియు ఆమె సోదరీమణులు నందు ని స్టార్ హీరో ను చేయాలని కన్న కలలన్నీ ఒక్కసారిగా చిధ్రమైపోయాయి.కాగా నందు తెలుగు, మలయాళం, తమిళం, తదితర భాషలలో కలిపి రెండు చిత్రాలలో నటించాడు.
కానీ ఇందులో లయనం చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోగా మరో చిత్రం విడుదలకు నోచుకోలేదు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి ఊర్వశి సోదరి కల్పన కూడా మరణించింది.కాగా ప్రస్తుతం నటి ఊర్వశి పలు తమిళ, మలయాళ భాషలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ బాగానే రాణిస్తోంది.కాగా ఆ మధ్య నటి ఊర్వశి తెలుగులో సమంత మరియు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన “ఓహ్ బేబీ” చిత్రంలో నటించి బాగానే ఆకట్టుకుంది.