ఒక్కోసారి కొంతమంది నటీనటులకి అందం, అభినయం, నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశాలు రాక గుర్తింపునోచుకోనటువంటి నటీనటులు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు తెలుగులో హీరో సందీప్ కిషన్ మరియు ప్రముఖ దర్శకుడు కన్మణి కాంబినేషన్ లో తెరకెక్కిన “బీరువా” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “సురభి” కూడా ఈ కోవకే చెందుతుంది.కాగా నటి సురభి బీరువా చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ శర్వానంద్ హీరోగా నటించిన “ఎక్స్ ప్రెస్ రాజా” చిత్రంలో మాత్రం బాగానే ఆకట్టుకుంది.
దీంతో ఈ అమ్మడికి తమిళం, తెలుగు తదితర భాషలలో సినిమా అవకాశాలు బాగానే క్యూ కట్టాయి.కానీ దురదృష్టవశాత్తు ఈ అమ్మడు నటించిన పలు చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.
మరికొన్ని చిత్రాలు అయితే కనీసం విడుదలయినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు.
దీంతో ఈ మధ్య సురభి తన సినీ కెరీర్ పై మరింత దృష్టి సారించింది.
ఇందులో భాగంగా తన అందంపై మరింత కేర్ తీసుకుంటోంది.అంతేగాక ఈ మధ్య కొంత మేర బరువు పెరిగిన ఈ బ్యూటీ మళ్ళీ బరువు తగ్గే పనిలో పడింది.
ఈ క్రమంలో ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనర్ ని నియమించుకుని మరి బరువు తగ్గేందుకు కష్ట పడుతోంది.కాగా తాజాగా సురభి తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలని పరిశీలించినట్లయితే ఈ మధ్య సురభి బాగానే సన్నబడినట్లు తెలుస్తోంది.
దీంతో ఈ అందమైన ఫోటోపై నెటిజన్లు స్పందిస్తూ హీరోయిన్ సురభి కి అన్నీ ఉన్నా లక్ లేకపోవడంతో సురభి కి అవకాశాలు వరించడం లేదని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలె సురభి తెలుగులో “శశి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రంలోని “ఒకే ఒక లోకం నువ్వు” అనే పాట యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యింది.కానీ ఈ చిత్రం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
కాగా ప్రస్తుతం సురభి తమిళంలో హీరో మరియు మ్యూజిక్ డైరెక్టర్ “జీవి ప్రకాష్ కుమార్” హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.