తెలుగు హీరోలపై మరియు తరచూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ, అలాగే సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో నిత్యం వార్తల్లో నిలిచే తెలుగు నటి శ్రీ రెడ్డి గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అప్పట్లో ఈ అమ్మడు క్యాస్టింగ్ కౌచ్ పై చేసినటువంటి హంగామా అంతా ఇంతా కాదు.
దీంతో అనుకోకుండా టాలీవుడ్ సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురైనప్పటికీ సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటూ బాగానే పాపులర్ అవుతోంది.కాగా తాజాగా తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవలే శ్రీ రెడ్డి తమిళ ప్రముఖ నటుడు జయరామన్ గురించి ఓ విషయాన్ని షేర్ చేసింది.దీంతో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ భారత ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ మరియు అతడి భార్య అయేషా ముఖర్జీ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ శిఖర్ ధావన్ భార్య శ్రీ రెడ్డి ని పోలి ఉందంటూ కొంతమేర వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.
దీంతో శ్రీ రెడ్డి తనదైన శైలిలో ఈ విషయంపై స్పందిస్తూ ఛీ వెధవ… నాకు అక్రమ సంబంధాన్ని అంటగడుతున్నావా…?.నేను ఇప్పటికీ వర్జిన్ అంటూ రిప్లై ఇచ్చింది.
దీంతో శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.మరికొందరైతే మీరు స్టిల్ వర్జిన్ అయితే గతంలో అవకాశాల పేరుతో మిమ్మల్ని దారుణంగా వాడుకున్నారని చేసిన వ్యాఖ్యలు అబద్ధమా.? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు మెగా హీరోలపై ఘాటు విమర్శలు చేస్తోంది.
కాగా ఈ మధ్య టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఈ విషయంపై స్పందిస్తూ కొంతమేర వ్యంగంగా కామెంట్లు చేసింది.ఇందులో భాగంగా తాను ఇలా అన్నానో లేదో అప్పుడే పుష్పానికి కరోనా వచ్చేసిందట.పాపం… అంటూ పేర్కొంది.అలాగే మీమ్ పేజెస్ ట్రోల్స్ చేయాలని కూడా కోరింది.
దీంతో శ్రీ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై మెగాఫ్యాన్స్ కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.