తెలుగులో ప్రముఖ దర్శకుడు ఆర్.సూర్య కిరణ్ దర్శకత్వం వహించిన “ధన 51” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ “సలోని అశ్విని” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించినప్పటికీ తన తదుపరి చిత్రం కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో ఎక్కువ కాలం హీరోయిన్ గా సినీ పరిశ్రమలో కొనసాగలేక పోయింది. దీనికి తోడు ఈ అమ్మడు నటించిన టువంటి చిత్రాలలో పాత్రలకి కూడా పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం మరింత మైనస్ అయ్యింది.
అయితే సలోని అశ్విని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో 20 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది .తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన బాడీగార్డ్ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఈ విభాగంలో సైమా అవార్డు కూడా గెలుచుకుంది.అయితే ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినప్పటికీ ఈ అమ్మడుకి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సలోని అశ్విని ముంబైలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నట్లు సమాచారం.
కాగా తెలుగులో చివరిగా “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు సలోని అశ్విని తెలుగులో నటించలేదు.
అయితే సలోని అశ్విని బాగా బరువు పెరిగినందువల్లనే ఆమెకు సినీ అవకాశాలు కరువయ్యాయని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.కానీ తెలుగులో అశ్విని హీరోయిన్ గా నటించిన మర్యాద రామన్న, చుక్కల్లో చంద్రుడు, ధన 51, ఒక ఊరిలో, కోకిల, తెలుగమ్మాయి, తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.