కరోనా అయినా తగ్గేది లేదంటున్న రష్మిక... ఇలా అయితే కష్టమే... 

టాలీవుడ్ లో ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక మందన్న వరుస హిట్లతో దూసుకు పోతోంది.  దీంతో ఈ అమ్మడికి కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్, అంటూ తేడా లేకుండా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

 Rashmika Mandanna, Telugu Actress, Remuneration News, Tollywood, Corona Effect,-TeluguStop.com

కాగా ఇటీవలే ఈ అమ్మడు తెలుగులో నటించిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాయి.అయితే తాజాగా నటి రష్మిక మందన గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుత కరోనా వైరస్ కాలంలో కొందరు హీరోయిన్లు తమ పారితోషికం విషయంలో కొంతమేర సడలింపులు చేస్తున్నప్పటికీ రష్మిక మందన్న మాత్రం తన పారితోషికం విషయంలో అసలు తగ్గడం లేదట. దీంతో ఈ విషయంపై స్పందించిన ఇటువంటి కొందరు సినీ విశ్లేషకులు సినిమా పరిశ్రమలో పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటే మరింత లైఫ్ ఉంటుందని లేకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని కొంతమేర పారితోషికం విషయంలో బెట్టు తగ్గించుకుంటే దర్శక నిర్మాతలకు ఊరట కలుగుతుందని సూచిస్తున్నారు.మరి ఈ విషయంపై రష్మిక మందన్న ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న “పుష్ప” అనే చిత్రంతో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే తమిళంలో కూడా ఇటీవలే స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube