తెలుగులో ప్రముఖ దర్శకుడు రవి బాబు దర్శకత్వం వహించిన “నచ్చావులే” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగు బ్యూటీ “మాధవీలత” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మాధవీలత వచ్చీరావడంతోనే మంచి హిట్ ని అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది.
దీనికితోడు ఈమె కెరీర్ లో ఈ చిత్రం తప్ప చెప్పుకోవడానికి మరో హిట్ చిత్రం లేకపోవడంతో తన ఉనికిని చాటుకునేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినీ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా తనకి “నచ్చావులే” చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పుడు తన ఫోన్ నెంబర్ దర్శకుడు రవి బాబు వద్ద లేకపోవడంతో తన పి.ఆర్ ని సంప్రదించడానికి చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చింది.అంతేకాక నచ్చావులే చిత్రం అంతగా హిట్ అవుతుందని తాను అనుకోలేదని కానీ తనకి ఈరోజు హీరోయిన్ గా సినిమా పరిశ్రమలో గుర్తింపు ఉందంటే అది కేవలం “నచ్చావులే” చిత్రం వల్లనే అని పేర్కొంది.
అలాగే ఆ తర్వాత తాను హీరో నానితో కలిసి స్నేహితుడా చిత్రంలో నటిస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పటికీ బాగానే గుర్తుందని తెలిపింది.
షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకత్వ విభాగంలో పనిచేసేటువంటి ఓ వ్యక్తి తాను అద్దె కారులో సినిమా షూటింగ్ కి వచ్చానని అవమానకరంగా మాట్లాడాడని ఆరోజు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు తనకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.
అయితే సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఖరీదైన కార్లు మరియు ఖరీదైన వస్తువులను వాడేటువంటి వారికి మాత్రమే మంచి విలువ ఉంటుందని లేకపోతే చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో మాధవీలత ఆశించిన స్థాయిలో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోలేక పోతోంది.దీంతో ఆ మధ్య ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి కూడా వచ్చింది.
కానీ అనుకోకుండా సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైంది.