తెలుగులో ప్రముఖ దర్శకుడు “క్రిష్ జాగర్లమూడి” దర్శకత్వం వహించిన “వేదం” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “దీక్షా సేథ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ మాస్ మహారాజ రవితేజ, మంచు మనోజ్, యాక్షన్ హీరో గోపీచంద్, తదితర స్టార్ హీరోల సరసన నటించింది.
కానీ అనివార్య కారణాల వల్ల ఈ అమ్మడు గత కొద్ది కాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది.దీంతో అప్పటి నుంచి సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు.
అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ ఫోటోలో దీక్షా సేథ్ తన స్నేహితురాలితో కలిసి ఈ ఫోటోని 1998వ సంవత్సరంలో దిగినట్లు తెలిపింది.దీంతో అభిమానులు ఈ ఫోటోకి తెగ లైకులు, కామెంట్లు చేస్తున్నారు.అంతేకాకుండా చిన్నప్పుడు దీక్షా సేథ్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా దీక్షా సేథ్ తెలుగు, కన్నడ, తమిళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా పదికి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ ఏమైందో ఏమోగాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల గత ఐదు సంవత్సరాలుగా సినిమాలకి దూరంగా ఉంటోంది.
కాగా దీక్షా సేథ్ చివరగా “జగ్గు దాదా” అనే కన్నడ చిత్రంలో నటించింది.ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ ఈ అమ్మడు సినిమాల్లో నటించలేదు.దీంతో ప్రస్తుతం దీక్షా సేథ్ ఎక్కడుంది.? ఏం చేస్తుందనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.