ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలు ఏదైనా ఓ విషయాన్ని షేర్ చేస్తే చాలు కొందరు నచ్చని వాళ్ళు వారి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.అయితే తాజాగా తెలుగులో “నాటకం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి బాలీవుడ్ బ్యూటీ “అసిమా నర్వాల్” చేసినటువంటి ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వివాదాస్పదంగా మారింది.
అయితే ఇంతకీ ఆ పోస్టు ఏంటంటే తాజాగా అసిమా నర్వాల్ సిగరెట్ తాగుతూ వీడియో తీసి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అయితే ఈ వీడియోలో అసిమా నర్వాల్ తెలుగులో బాలయ్య బాబు చెప్పేటువంటి ఫేమస్ అయిన “ట్రబుల్ ద ట్రబుల్” అనే డైలాగ్ చెబుతూ సిగరెట్ తాగుతూ కనిపించింది.
అయితే ఇందుకు క్యాప్షన్ మాత్రం ఓ సినిమాలోతన పాత్ర కోసం సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేస్తున్నానని తప్పుగా అనుకోవద్దని పెట్టింది. దీంతో కొందరు నెటిజన్లు ఆమె చేసినటువంటి ఈ పోస్ట్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
అంతేగాక సెలబ్రిటీ అయ్యుండి సిగరెట్ తాగుతూ ఇలా వీడియోలు పోస్టు చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా సినిమా పాత్రల కోసం అయినప్పటికీ ఇలాంటి పోస్టులు సెలబ్రిటీలు షేర్ చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వెంటనే ఈ పోస్ట్ డిలీట్ చేయాలంటూ సూచిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఈ అమ్మడు నటించిన “నాటకం, జెస్సీ” తదితర చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ ఈ అమ్మడు తమిళంలో రెండు చిత్రాలలో నటించే అవకాశాలు దక్కించుకుంది.