మామూలుగా ఎవరైనా సరే ఓ విజయం సాదించరంటే అందరూ కూడా ఆ వ్యక్తి విజయాన్ని మాత్రమే గుర్తు పెట్టుకుంటారు.ఎవరూ కూడా ఆ వ్యక్తి విజయం సాధించడానికి పడినటువంటి కష్టం, ఎదుర్కొన్నటువంటి సమస్యలు వంటి వాటి గురించి ఎవరూ ఆలోచించరు.
అయితే ఇటీవల టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించినటువంటి వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో సువర్ణ అనే తెలంగాణ యువతి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ గురించి పెద్దగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.
అయితే ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీరు మీ సినీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఓ చేదు సంఘటన గురించి తెలియజేయాలని కోరాడు.దీంతో ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ తాను సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో నలుపు రంగులో ఉండటంతో కొందరు దర్శక నిర్మాతలు తనకి అవకాశాలు ఇవ్వాలంటే చాలా ఆలోచించేవారని చెప్పుకొచ్చింది.
అంతేగాక ఓ దర్శకుడు ఏకంగా నువ్వు హీరోయిన్ గా పనికిరావని కూడా దారుణంగా అవమానించినట్లు తెలిపింది.దీంతో పలువురు నెటిజన్లు ఐశ్వర్యరాజేష్ చేసినటువంటి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఐశ్వర్యరాజేష్ తెలుగులో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నటువంటి టక్ జగదీష్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే హిందీ, తమిళం, కన్నడ తదితర భాషలలో కలిపి దాదాపుగా ఐదు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.
ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నటువంటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సంపాదించి బాగా ఎంజాయ్ చేస్తోంది.అందుకే అంటారు కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొంటే మున్ముందు మంచి భవిష్యత్ మరియు సుఖసంతోషాలు ఖచ్చితంగా ఉంటాయని.