తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన “ఆర్య చిత్రంలో అ అంటే అమలాపురం” అనే స్పెషల్ సాంగ్ లో నటించి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన తెలుగు హీరోయిన్ “అభినయ శ్రీ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటి అభినయశ్రీ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
కానీ ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి దీంతో అభినయ శ్రీ కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమైంది.అంతేగాక అప్పుడుడప్పుడూ పలు వ్యాంప్ తరహా పాత్రలలో నటించడమేగాక పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి అభినయ శ్రీ తెలుగు తమిళ, కన్నడ, మలయాళ, తదితర భాషలలో నటించిన ఓ సీనియర్ నటి కూతురని ఇప్పటికీ చాలామందికి తెలియదు. అయితే అభినయశ్రీ తల్లి ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటి “అనురాధ”.
అయితే అప్పటికే అనురాధ తల్లిదండ్రులు సినిమా పరిశ్రమలో బాగానే స్థిరపడ్డారు. అందువల్లనే అనురాధ కూడా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.
అయితే నటి అనురాధకి ఎక్కువగా మలయాళం, తమిళం భాషలలో సినిమా అవకాశాలు వరించడంతో తెలుగు సినిమాలపై పెద్దగా దృష్టి సారించలేకపోయింది.కాగాఅనురాధ ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
అంతేకాక అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించింది.
కాగా ప్రస్తుతం నటి అనురాధకి వయసు మీద పడటంతో సినిమాల్లో నటించడం లేదు.
కాగా నటి అనురాధ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 300 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.ప్రస్తుతం నటి అభినయశ్రీతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్న ట్లు సమాచారం.
ఇక నటి అభినయశ్రీ విషయానికొస్తే 2014 సంవత్సరంలో “పాండవులు” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో అసలు విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు.
అయితే ఏమైందో ఏమో గాని దాదాపు ఆరు సంవత్సరాలుగా అభినయశ్రీ తెలుగులో నటించలేదు.