తెలుగులో పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ మరియు విలన్ పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ నటుడు సమీర్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా తాజాగా నటుడు సమీర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో భాగంగా తనకి సినిమాల్లో పాటలు పాడాలని ఉందని కానీ ఇప్పటి వరకు ఆ కోరిక మాత్రం తీరలేదని చెప్పుకొచ్చాడు. అయితే సినిమా పరిశ్రమలో తనకు ఎంతో సన్నిహితుడైన ప్రముఖ సింగర్ రఘు కుంచే మాత్రం ఓసారి తన వాయిస్ విని తనతో కచ్చితంగా సినిమాలో ఓ పాటని పాడిస్తానని చెప్పాడట.
కానీ ఇప్పటి వరకు రఘు కుంచే కూడా స్పందించలేదని సరదాగా చెప్పుకొచ్చాడు.అయితే తాను కాలక్షేపం కోసం డబ్ స్మాష్ లాంటి ఓ యాప్ లో దాదాపుగా ఎనిమిది వేలకు పైగా పాటలు పాడానని దాంతో సింగర్ సునీత ఈ విషయంపై స్పందిస్తూ మనిద్దరం కలిసి పాటలు పాడుదామని కూడా చెప్పిందట.
అయితే తాను చాలా ముక్కుసూటి గా ఉంటానని, మనసులో ఒకటి ఉంచుకొని బయటికి మరొకటి మాట్లాడడం తనకు ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు.అందువల్లనే తన స్నేహితులు తనని బాగా ఇష్టపడుతుంటారని కూడా తెలిపారు.
అలాగే సినిమా పరిశ్రమలో తనకి జూనియర్ ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉంటాడని కానీ ఎప్పుడూ కూడా తారక్ ని సినిమా అవకాశాల కోసం రికమెండ్ చేయమని అడగలేదని తెలిపాడు.అలాగే తాము ఎప్పుడు కలిసినా సరే వ్యక్తిగత విషయాల గురించి మాత్రమే చర్చించుకుంటామని, వృత్తి పరంగా ఎలాంటి చర్చలు ఉండవని కూడా స్పష్టం చేశాడు.
అలాగే సినిమా పరిశ్రమలో తను అందరితోనూ చాలా సన్నిహితంగా సరదాగా మెలగుతానని కూడా తెలిపాడు.కాగా ప్రస్తుతం సమీర్ తెలుగులో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.