టాలీవుడ్ లో ఈ ఏడాది ఆరంభం నుంచి పెళ్లి వేడుకల హడావిడి నడుస్తుంది.హీరోలు ఒక్కొక్కరుగా ఒక ఇంటివారు అవుతున్నారు.
నిఖిల్, నితిన్, తాజాగా రానా పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించారు.ఇక మెగా ఫ్యామిలీలో కూడా ఈ ఏడాది పెళ్లి సంబరం మొదలైంది.
మెగా బ్రదర్ నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యింది.మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకున్న నిహారికా ఇప్పుడు భార్య స్థానంలోకి వెళ్లిపోతుంది.
నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం హైదరాబాదులో తాజాగా జరిగింది.
గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్ రావు తనయుడు అయిన చైతన్య ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారికా, చైతన్య నిశ్చితార్థం వేడుక జరిగింది.నిశ్చితార్థ వేడుకలో నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్, సాయితేజ్ తదితరులు సందడి చేశారు.
ఇక ఈ నిశ్చితార్ధ వేడుకకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ నిశ్చితార్ధ వేడుకకి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు.ఇదిలా ఉంటే ఈ పెళ్లి వేడుకని ఈ ఏడాది ఆఖరులో గాని లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో గాని చేయడానికి మెగా ఫ్యామిలీ నిర్ణయించినట్లు తెలుస్తుంది.కరోనా పరిస్థితుల బట్టి పెళ్లి వేడుక ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.
పెళ్లి తర్వాత నిహారికా నటిగా కెరియర్ కొనసాగిస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పాలి.