తెలుగులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “శివ” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి నటిగా నటుడిగా పరిచయం అయినటువంటి టాలీవుడ్ ప్రముఖ నటుడు ఉత్తేజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు ఉత్తేజ్ పలు చిత్రాలలో కమెడియన్ గా మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.
అంతేగాక దాదాపుగా 5కి పైగా చిత్రాలలో డైలాగు రైటర్ గా కూడా పని చేసాడు.కాగా నటుడు ఉత్తేజ్ పెద్ద కూతురు చేతన ఉత్తేజ్ కూడా సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయింది.
కానీ ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో చాలా మందికి తెలియదు.
అయితే చేతన 2017వ సంవత్సరంలో “పిచ్చిగా నచ్చావ్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
ఈ చిత్రంలో చేతన ఉత్తేజ్ తోపాటు యంగ్ నటుడు నందు, మెగా బ్రదర్ నాగబాబు, హీరోయిన్ కారుణ్య చౌదరి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయింది.
దీంతో ఈ అమ్మడికి పెద్దగా సినిమా అవకాశాలు వరించలేదు.
అయితే ప్రస్తుతం చేతన ఉత్తేజ్ టాలీవుడ్ చెందినటువంటి ఓ ప్రముఖ సినీ నటుడిని పెళ్లి చేసుకుందని పలు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు మాత్రం స్పందించలేదు.
అంతేగాక ఉత్తేజ్ కి ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆమె ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని కుటుంభం సభ్యులకి దూరంగా ఉంటున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు.కానీ ఉత్తేజ్ కుటుంభం సభ్యులు మాత్రం ఈ విషయం పై స్పందించలేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఉత్తేజ్ తెలుగులో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నారు. అంతేగాక ఇటీవల ఓ చిన్న బడ్జెట్ తరహా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.