టాలీవుడ్ లో ఈమద్య కాలంలో వచ్చిన సినిమాలు అన్ని ఇన్నీ కావు.వారంకు రెండు మూడు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వగా మరి కొన్ని మాత్రం నిరాశ పర్చాయి.మొత్తం గా అయితే టాలీవుడ్ కలకలలాడుతూనే ఉంది.
అయితే కొన్ని సినిమాలు నిరాశ పర్చితే వాటిని వెంటనే ఓటీటీ లో విడుద ల చేస్తున్నారు.సాదారణంగా అయితే తెలుగు సినిమా లు థియేటర్లలో విడుదల అయిన 50 రోజుల వరకు ఓటీటీ లో విడుదల కావడానికి వీలు లేదు.
కాని కరోనా కారణంగా ఏ సినిమా లకు అయితే థియేటర్లలో ఆధరణ కరువయ్యిందో ఆ సినిమా లను వెంటనే ఓటీటీ లో విడుదల చేసుకునేలా ఒప్పందాలు జరుగుతున్నాయి.ఇటీవల కాలంలో చాలా సినిమా లు కనీసం వారం రోజులు కూడా కాకుండానే ఓటీటీలో వచ్చాయి.
అదే జాబితాలో కీరవాణి కొడుకు అయిన సింహా సినిమా కూడా చేరింది.ఇటీవలే ఈయన నటించిన తెల్లవారితే గురువారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం అంతా వ్యక్తం చేశారు.కాని ఆ సినిమా నిరాశ మిగిల్చింది.
థియేటర్లలో విడుదల అయిన వారం రోజుల్లోనే మొత్తం జీరో వసూళ్లకు పడిపోయింది.దాంతో ఆహా లో స్ట్రీమింగ్ కు ఆ సినిమాను ఉంచారు.
భారీ అంచనాల నడుమ ఈ సినిమా ను విడుదల చేశారు.ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు అవ్వడంతో పాటు జక్కన్న కు సింహా కొడుకు వరుస అవ్వడం వల్ల కూడా జనాల్లో ఈ సినిమాపై ఆసక్తి ఉంది.
కనుక భారీ ఎత్తున విడుదల చేశారు.కాని సినిమా మాత్రం నిరాశ పర్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
సినిమా పై ఉన్న బజ్ తగ్గక ముందే ఆహా లో స్ట్రీమింగ్ కు సిద్దం చేశారు అంటూ సమాచారం అందుతోంది.ఆహా వారు ఈ సినిమాను భారీ మొత్తంకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.