ప్రపంచంలో పలు దేశాలని అగ్ని పర్వతాలు భయపెడుతున్న సంగతి తెలిసిందే.పలు ప్రాంతాలలో అగ్ని పర్వతాల విస్పోటనం కారణం పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి.
తాజాగా న్యూజీలాండ్ లో పర్యాటక ప్రాంతం వైట్ ఐస్ ల్యాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది.అగ్నిపర్వతం పేలడంతో పదుల సంఖ్యలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
అయితే తాజాగా ఈ అగ్నిప్రమాద ఘటనలో గాయపడ్డ తెలంగాణకి చెందిన మయూరి సింగ్ చౌహాన్ అనే మహిళ మృతి చెందింది.
అమెరికాలోని అట్లాంటా సిటీలో నివాసం వుంటున్న ప్రతాప్ సింగ్, మయూరీ సింగ్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా గుర్రాల తండా.
ప్రతాప్ సింగ్ ఇరవై ఏళ్ల క్రితం అమెరికా వలస వెళ్ళిపోయాడు.అక్కడ పలు వ్యాపారాలు చేస్తున్నాడు.ఈ నెల 9న ప్రతాప్ సింగ్ తన కుటుంబంతో కలిసి న్యూజీలాండ్ లోని వైట్ ఐస్ లాండ్ కు విహారయాత్రకు వెళ్లారు.ఈ సమయంలో అగ్నిపర్వతం పేలడంతో ప్రతాప్ సింగ్ తో పాటు అతని భార్య మయూరీ తీవ్ర గాయాలకి గురయ్యారు.
తాజాగా 70 శాతం కాలిన గాయాలతో మూయూరి సింగ్ మృతి చెందారు.దీంతో వారి సగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
ప్రతాప్ సింగ్ ఆరోగ్యం కొంతవరకు మెరుగైనట్టు సమాచారం అందింది.మయూరి సింగ్ మృతితో ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది
.