కేఆర్ఎంసీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరుతున్నట్లు తెలుస్తోంది.సుప్రీంకోర్టులో రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణతో అధికారులు ఢిల్లీ వెళ్లారని ఈ నేపథ్యంలో భేటీని వాయిదా వేయాలని తెలంగాణ అధికారులు కోరుతున్నారు.
ఇప్పటికే సమావేశం కోసం ఏపీ అధికారులు హైదరాబాద్ కు చేరుకున్నారు.అయితే సమావేశం వాయిదాప కేఆర్ఎంసీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని కేఆర్ఎంసీ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.కనీస నీటిమట్టంపై సీడబ్ల్యూసీ 834 అడుగులు ఉండాలనే ప్రతిపాదన తీసుకువచ్చింది.
సీడబ్ల్యూసీ ప్రతిపాదనను కాదని ఆర్ఎంసీ 854 అడుగుల ప్రతిపాదన పెట్టడంపై తెలంగాణ అభ్యతరం తెలిపింది.ఈ నేపథ్యంలో ఆర్ఎంసీ ప్రతిపాదనపై తెలంగాణ లేఖ రాయాలని చూస్తుంది.