తెలంగాణలోని ప్రభుత్వ అధికారులు, మంత్రులు, నేతలు వరుసగా కోవిడ్ బారినపడుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.కాగా కరోనా కట్టడికి తీసుకునే చర్యలు ఏమో గానీ ఇంతటి క్లిష్ట పరిస్దితుల్లో కూడా ఎన్నికలు నిర్వహించడం కరోనా వ్యాప్తిని మరింతగా పెంచిదనే విమర్శలు ప్రభుత్వం పై వస్తున్నాయి.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరిగి పోతుంది.ఇకపోతే మరో మంత్రి కరోనా కొరల్లోకి వెళ్లారు.ఆయనే తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.ఈయనికి స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటం తో టెస్టు చేయించుకోగా పాజిటివ్గా తేలిందని స్వయంగా తెలిపారు.
కాగా తన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నానని, అయితే ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ నిబంధనలను పాటించాలని తెలిపారు.