టీటీడీపీ ఎమ్మల్యే రేవంత్ రెడ్డి లంచం కేసులో జైలుకు వెళ్లడంతో ఆయన కుటుంబం షాక్ తిన్నది.వారింకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు.
ముఖ్యంగా రేవంత్ భార్య గీత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.టీడీపీ ఎమ్మల్యేలంతా ఆమెను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చడానికి రేవంత్ ఇంటికి వెళ్లినప్పుడు గీత వారిని కడిగిపారేశారు.
తన భర్తను ఎందుకు రక్షించలేకపోయారని, ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు.కొందరు ఆయన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్ర చేశారని (టీడీపీ నాయకులని ఆమె ఉద్దేశమా?) ఆరోపించారు.తామంతా రేవంత్కు అండగా ఉంటామని, ఆయన్ని జైలు నుంచి విడిపిస్తామని నాయకులు హామీ ఇచ్చినా ఆమె సంతృప్తి చెందలేదు.రేవంత్ భార్య ఇంత ఆందోళన చెందడానికి అసలు కారణమేమిటంటే నేరం రుజువైతే రేవంత్కు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఎన్నికలకు కూడా అనర్హుడవుతాడు.మొత్తంగా ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితాలు అంధకారమవుతాయి.
మరి ఇది ఎవరికైనా ఆందోళనకరమే కదా.రేవంత్ను రక్షించడం టీడీపీ నాయకులకు అంత సులభం కాదు.ఆయన నేరం చేసినట్లు బలమైన వీడియో క్లిప్పింగులున్నాయి.చూద్దాం ఏమవుతుందో….!
.