బాబుని కలిసిన 'మచ్చా' ! పార్టీ మార్పుపై డెసిషన్ ఇదే

తెలంగాణలో టీడీపీ తరుపున గెలిచింది ఇద్దరు ఎమ్యెల్యేలు.వారిలో ఒకరు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఒకరుకాగా.

 Telangana Tdp Mla Machha Nageswararao Meet To Chandrababu-TeluguStop.com

మరొకరు అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు.అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ… టీడీపీని వీడి టీఆర్ఎస్ లోకి జంప్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును మచ్చా నాగేశ్వరరావు కలిశారు.

టీడీపీని వీడి వెళ్లడం లేదని… చంద్రబాబుకు క్లారిటీ ఇచ్చారు.

చంద్రబాబునాయుడు తనపై నమ్మకంతో అశ్వారావుపేట టికెట్ ఇచ్చి అవకాశం కల్పించారని ఆయన అన్నారు.34 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే కోనసాగుతున్నానని.బతితికి ఉన్నంతవరకూ ఈ పార్టీలోనే కోనసాగుతానని చెప్పారు.

దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ లో ఆయన చేరడం లేదు అనే క్లారిటీ వచ్చేసింది.ఇక తేలాల్సింది సండ్ర వీరయ్య సంగతే.

అయితే ఆయన ఈ నెల 26 వ తేదీన టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube