తెలంగాణలో కారు గుర్తుకు ఈ మధ్య కాలంలో చాలానే బ్రేకులు పడుతున్న విషయం తెలిసిందే.ఏమంటే దుబ్బాక ఎలక్షన్లో ఓటమి ఎదురైందో అప్పటి నుండి గులాభి నేతల గుండెల్లో నాటు బాంబులు పేలుతున్నాయట.
ఎందుకంటే కేటీయార్ ఒకవైపు, కేసీయార్ ఒకవైపు దూసుకువస్తున్న బిజేపీ హవాను ఆపకుంటే మీ పదవులకే ఎసరు పెట్టవలసి వస్తుందని, ఏం చేస్తారో తెలియదు తెలంగాణలో గులాభి వాడిపోకుండా చూసుకునే బాధ్యతలు మీవే అని పెద్ద పెద్ద బరువులు పెట్టడంతో టీఆర్ఎస్ నాయకులకు తలనొప్పిగా మారిందట.
అంతే అప్పటి నుండి ఏ ఎన్నికలు వచ్చినా రేయి పగలు శ్రమించి పార్టీ పరువును నెత్తిన పెట్టుకుని మోస్తున్నారట.
ఈ నేపధ్యంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక అనేది టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టంగా మారింది.ఇక్కడ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న గులాభి బాస్ ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నాదట.ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్థిని పోటీలోకి దించేందుకు పార్టీ అధిష్టానం డిసైడ్ అయ్యింది.
రోజురోజూకీ మారుతోన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పేరు ఖరారుకానుంది.
ఇందులో భాగంగానే బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్ అల్లుడు కట్టబోయిన గురవయ్య యాదవ్ను రంగంలోకి దించేందుకు సిద్దపడుతున్నారట.ఈ మేరకు నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఎవరూ ఊహించని విధంగా గురవయ్యయాదవ్ పేరు తెరపైకి రావడంతో రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.