కాంగ్రెస్ పార్టీ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణా రాజకీయాల్లో రోజు రోజుకు మాటల యుద్ధం తీవ్రతరం అవుతుంది.ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు విమర్శించుకుంటున్న విషయం తెలిసిందే.

 Telangana, Minister, Jagadesh Reddy, Comments, Congress Party, Telangana Ministe-TeluguStop.com

ఈ నేపధ్యంలో రాష్ట్ర‌ మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ పాల‌న‌లో‌ తెలంగాణ‌ ప్రజలు సంతోషంగా ఉండటం కాంగ్రెస్‌కు నచ్చడం లేదని, తెలంగాణ ప్రజల ఉసురు తాకడం వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనమైంద‌ని విమ‌ర్శించారు.

ఇక కాంగ్రెస్ చరిత్రను చూస్తే ఆ పార్టీ నాయకులకు, మంత్రులకు ఎన్నో కేసుల్లో జైలుకు వెళ్లిన చరిత్ర ఉంద‌ని ఎద్దేవా చేశారట.

భవిష్యత్తులో అయితే కాంగ్రెస్ ముఖం కూడా చూసే వారుండరని, అదీగాక తెలంగాణలో నిర్వ‌హించే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.

కేసీయార్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ముందు కెళ్లుతుందని, అది చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మంత్రి జగదీష్ రెడ్డి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube