తెలంగాణా రాజకీయాల్లో రోజు రోజుకు మాటల యుద్ధం తీవ్రతరం అవుతుంది.ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు విమర్శించుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండటం కాంగ్రెస్కు నచ్చడం లేదని, తెలంగాణ ప్రజల ఉసురు తాకడం వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనమైందని విమర్శించారు.
ఇక కాంగ్రెస్ చరిత్రను చూస్తే ఆ పార్టీ నాయకులకు, మంత్రులకు ఎన్నో కేసుల్లో జైలుకు వెళ్లిన చరిత్ర ఉందని ఎద్దేవా చేశారట.
భవిష్యత్తులో అయితే కాంగ్రెస్ ముఖం కూడా చూసే వారుండరని, అదీగాక తెలంగాణలో నిర్వహించే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.
కేసీయార్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ముందు కెళ్లుతుందని, అది చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మంత్రి జగదీష్ రెడ్డి.