ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న తెలంగాణా రాష్ట్రంలో ఓ పక్క వ్యాక్సిన్ డ్రైవ్ కూడా జరుగుతుంది.తెలంగాణాకు 55,52,360 వ్యాక్సిన్ డోస్ లు వచ్చాయి.
అందులో 54,39,713 వ్యాక్సిన్లు వాడేసినట్టు తెలుస్తుంది.వీటిలో మొదటి డోస్ వ్యాక్సిన్ 43,74,351 దాకా వేసినట్టు తెలుస్తుంది.
ఇక ఈమధ్యనే మొదలైన సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా 10,65,362 డోస్ లను వేసినట్టు తెలుస్తుంది.
బుధవారం రోజు మొదటి డోస్ 657 మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేశారు.
ఇక సెకండ్ డోస్ నిన్న 33,438 డోస్ ల దాకా వేసినట్టు తెలుస్తుంది.ప్రస్తుతానికి 45 ఏళ్లు పై బడిన వారికే ఈ వ్యాక్సిన్ డోస్ వేస్తున్నారు.
అయితే ఆ ఏజ్ వాళ్లకే ఫస్ట్ డోస్ మిస్సైన వారికి ఆ డోస్.ఫస్ట్ డోస్ వేసుకుని 28 రోజులు దాటిన వారికి సెకండ్ డోస్ కూడా వేస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రం లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసిందని చెప్పొచ్చు.తర్వాత దశలో 18 నుండి 44 మధ్య వయసు వారికి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణాలో వ్యాక్సి ప్రక్రియ బాగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది.అయితే ఓ పక్క కేసులు పెరుగుతుండగా లాక్ డౌన్ తో పాటుగా సాధ్యమైనంత వరకు ఈ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తుంది తెలంగాణా ప్రభుత్వం.